Skip to main content Scroll Top
“డిజిపబ్ తీవ్ర హెచ్చరిక: కశ్మీర్ టైమ్స్పై దాడితో జర్నలిజం స్వేచ్ఛ ప్రమాదంలో”

ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు జరిగిన ఏ అటాక్ అయినా దేశం కోసం ప్రమాద ఘంటిక అని డిజిపబ్ స్పష్టం చేసింది. నిజాన్ని వెలుగులోకి తేవడానికి పనిచేసే జర్నలిస్టులను ఇలాంటి దాడులతో భయపెట్టలేమని సంస్థ పేర్కొంది.

డిజిపబ్ ప్రకారం, స్వతంత్ర మీడియా అంటే ప్రజల గొంతు. ఆ గొంతును అణచివేయడానికి చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లేనని వారు హెచ్చరించారు. విచారణాత్మక జర్నలిజం, నిజాన్ని బయటపెట్టే కథనాలు, అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం  ఇవన్నీ దేశానికి అవసరమైన విలువలని సంస్థ గుర్తుచేసింది.“రైడ్లు, బెదిరింపులు, వేధింపులు జర్నలిజాన్ని ఆపవు. అవి మరింత ధైర్యానికి, నిజం కోసం మరింత పోరాటానికి దారితీస్తాయి” అని డిజిపబ్ స్పష్టం చేసింది.

కశ్మీర్ టైమ్స్‌పై జరిగిన చర్యలు మీడియా స్వేచ్ఛను అణగదొక్కే ప్రమాదకర సంకేతమని చెప్పిన డిజిపబ్, దేశంలోని ప్రతీ పౌరుడు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కూడా పిలుపునిచ్చింది.

సత్యం పట్ల కట్టుబాటు ఉన్న జర్నలిస్టులు వెనక్కి తగ్గరు.
ఎందుకంటే  ‘జర్నలిజం నేరం కాదు’… అది ప్రజల హక్కు.”

Related Posts
Clear Filters