తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 117 నూతన గేట్ల నిర్మాణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గోదావరి డెల్టా రైతాంగానికి దీర్ఘకాలిక జల భద్రతను కల్పించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
అనంతరం పిచ్చుకలంకలో నిర్వహించిన బహిరంగ సభలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సహచర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు