Skip to main content Scroll Top
ప్రయాగ్‌రాజ్‌లో జర్నలిస్ట్ హత్య: నిజం చెప్పిన కలం ఎవరిని భయపెట్టింది?

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరాన్ని కుదిపేసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. గురువారం సాయంత్రం హోటల్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి, 54 ఏళ్ల జర్నలిస్టు లక్ష్మీ నారాయణ సింగ్ అలియాస్ పప్పును హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సిటీ డీసీపీ మనీష్ షాండిల్యా తెలిపిన వివరాల ప్రకారం, తీవ్ర రక్తస్రావంతో అతన్ని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించగా, అక్కడే వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. అదనపు డీసీపీ పుష్కర్ వర్మా ప్రకారం, ఇది పన్నిన దాడి కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన లక్ష్మీ నారాయణ సింగ్, హైకోర్ట్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింగ్‌కు మేనల్లుడు.

పోలీసు బృందాలు ప్రాంతంలోని సీసీటీవీ వీడియోలను విశ్లేషిస్తూ, నిందితుల గుర్తింపు కోసం విస్తృత విచారణ చేపట్టాయి.

ఈ దారుణం మరోసారి ఒక ప్రశ్న ముందుకు తెచ్చింద
నిజాన్ని రాసే జర్నలిస్టు ఎందుకు లక్ష్యంగా మారుతున్నాడు?
మీడియా స్వేచ్ఛకు రక్షణ ఎక్కడ?

నిజం కోసం కలం పట్టిన జర్నలిస్టు రక్తంతో ముగిసిన ఈ సంఘటన భారత ప్రజాస్వామ్య విలువలకు భారీ సవాలు.

Related Posts
Clear Filters