Skip to main content Scroll Top
నందిగుంట: మంచి నీటి ట్యాంక్ వద్ద అపరిశుభ్రత – ప్రజల ఆందోళన

నందిగుంట:

స్థానిక రక్షిత మంచి నీటి పథకం (ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్) పరిసరాలు తీవ్ర అపరిశుభ్రంగా మారాయని నందిగుంట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరు అందించే ట్యాంక్ మరియు దాని పక్కనే ఉన్న బోర్ మోటార్ గది చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోయింది. పారిశుధ్య లోపం కారణంగా నీరు కలుషితమై రోగాలు పడతామేమోనని స్థానికులు భయపడుతున్నారు.

వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి, ట్యాంక్ పరిసరాలను శుభ్రం చేయించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts
Clear Filters