Scroll Top
శేఖర్ గుప్తా జర్నలిజం: లాభం మధ్యలో విలువల జ్వాల

భారత జర్నలిజం ప్రపంచంలో ప్రభావం, ప్రాచుర్యం, పట్టు ఈ మూడు ఒక్క వ్యక్తికి ఒక్కచోట కలిసివచ్చిన ఉదాహరణ శేఖర్ గుప్తా. చిన్న పట్టణంలో పుట్టి, దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల జర్నలిస్టుగా ఎదిగిన ఆయన గాధ, పోస్ట్-రీఫార్మ్ ఇండియా కలలకూ అంబిషన్‌కూ ప్రతీక. ‘పీపుల్ ఆర్ ది క్యాపిటల్’ అనే తన సిద్ధాంతంతో, రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు ఎవరితోనైనా సంబంధాలు నిర్మించడంలో ఆయన చూపిన నైపుణ్యం అసాధారణం. జర్నలిస్ట్‌గానే కాదు, ఎడిటర్‌, సీఈఓగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రభావశీల మీడియాలోగా నిలపడం ఆయన ప్రత్యేక సామర్థ్యం.

కఠిన ప్రశ్నలు అడగగల ధైర్యం, అదే సమయంలో స్నేహాలను కాపాడుకునే మృదుత్వం ఈ రెండు మిశ్రమమే ఆయన బ్రాండ్. ఈ బలమే Walk the Talk వంటి ఇంటర్వ్యూ షోలను శిఖరాలకు చేర్చింది. ఆపరిస్‌థితుల్లో కూడా ఆయన వాస్తవాలు, పరిశోధన, ప్రొఫెషనలిజం మీద రాజీపడరని సహచరులు చెబుతారు. అయితే శక్తి కేంద్రాలకు దగ్గర కావడం, వ్యక్తిగత సంబంధాలు, ఆభిజాత్య వర్గంతో అనుబంధం ఇవన్నీ విమర్శలకు కూడా దారిచూపాయి. అయినప్పటికీ, “మార్కెట్‌కి వ్యతిరేకం కాని మంచి జర్నలిజం” అనే ఆయన నమ్మకం, జర్నలిజాన్ని లాభదాయకంగా మరియు ప్రభావవంతంగా మార్చాలన్న ఆయన దృక్పథం మీడియా రంగంలో కొత్త చర్చలకు తావిచ్చింది.

చివరికి, శేఖర్ గుప్తా కథ ఒక్క జర్నలిస్టు విజయ గాథ మాత్రమే కాదు భారత జర్నలిజం రూపం ఎలా మారిందో తెలిపే ఆధునిక అధ్యాయం. లాభం సిద్ధాంతం ప్రభావం మధ్య సమతుల్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చూపిన అరుదైన ఉదాహరణ.

Related Posts
Clear Filters