Skip to main content Scroll Top
కదిరి మున్సిపల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి

కదిరి పట్టణంలోని వాణివీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. జనసేన పట్టణ అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వాణివీధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయడం, కాలువలను శుభ్రం చేయడం, గతంలో మూసివేసిన మంచినీటి కొళాయిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని పంపించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంజిబాబు, రవికుమార్, ఇర్ఫాన్, రవీంద్ర నాయక్, గంగరాజు, సుదర్శన్, చక్రధర్ బాబు, మునిగోపాల్, సరస్వతి, అశోక్ కుమార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts
Clear Filters