Skip to main content Scroll Top
మంచిర్యాల జిల్లాలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

శ్రీరాంపూర్ :మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

శ్రీరాంపూర్, సీసీసీ కార్నల్, మంచిర్యాల ఐబీ చౌరస్తా, రైల్వే స్టేషన్ వద్ద పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ₹1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

Related Posts
Clear Filters