ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలో ప్రముఖ జర్నలిస్టు లక్ష్మీ నారాయణ సింగ్ (పప్పు) హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. హర్ష్ హోటల్ సమీపంలో గురువారం సాయంత్రం ఆయనపై కత్తితో దాడి జరిగింది.
తీవ్రంగా గాయపడిన ఆయనను స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించగా, అక్కడే మరణించారు. ప్రధాన నిందితుడు విశాల్ను పోలీసులు అదే రాత్రి ఎన్కౌంటర్లో కాల్చి అరెస్ట్ చేశారు. ఈ ఘటన జర్నలిస్టుల భద్రతపై ప్రశ్నలు రేపుతోంది.
మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు న్యాయం కోసం గళమెత్తుతున్నారు